'పొత్తు పెట్టుకున్నా.. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి'

by GSrikanth |   (  Updated:2023-01-23 03:27:50  IST  )

కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

పొత్తు పెట్టుకున్నా.. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో వైసీపీ పాలన అంతమొందించాలంటే జనసేన-టీడీపీ పొత్త తప్పనిసరి అవసరమని అభిప్రాయపడ్డారు. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాంటే రాజ్యాధికారం అనివార్యమని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల రాజ్యమే కాపు సంక్షేమనేన లక్ష్యమని అని వ్యాఖ్యానించారు.

Also Read...

రాయలసీమపై కేసీఆర్ ఫోకస్.. BRSలోకి ఆ కీలక నేతలు

Next Story